30 January 2021 – Daily Current Affairs Bits in Telugu
- అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు ఏమి తప్పనిసరి చేశారు?- విమానాశ్రయంలోనే కరోనా పరీక్ష మరియు తప్పనిసరి నిర్బంధం.
- ఏ ద్విచక్ర వాహన తయారీదారు తన 100 మిలియన్ల బైక్ను ఫ్యాక్టరీ నుండి తయారు చేసి, ప్రపంచంలోనే మొట్టమొదటి సంస్థగా అవతరించింది? – హీరో మోటోకార్ప్.
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఏ బ్యాంకుకు రూ .2 కోట్ల జరిమానా విధించింది? – ప్రామాణిక చార్టర్డ్ బ్యాంక్.
- జకార్తాలోని ఆసియాన్ సచివాలయానికి భారత కొత్త రాయబారిగా ఎవరు నియమించబడ్డారు? – జయంత్ ఖోబ్రగడే.
- ఏ క్రికెటర్ శ్రీలంక ఫ్రాంచైజ్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు? – లసిత్ మలింగ.
- అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీయాతో సహా చైనా ఎంత మంది అధికారులను నిషేధించాలని నిర్ణయించింది? – 28 మంది అధికారులు.
- కాలిఫోర్నియో రాష్ట్రంలోని డేవిస్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రాష్ట్రాల్లో తాజాగా పశ్చిమబెంగాల్ చేరింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. - రానున్న రెండేళ్లలో ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
- చెన్నై మెరీనా తీరంలో నిర్మించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రారంభించారు. ఫీనిక్స్ పక్షి రూపంలో సుమారు రూ.80 కోట్ల వ్యయంతో 50,422 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ చిహ్నాన్ని నిర్మించారు.
- దేశంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు బేసిక్ గ్రాంట్ల కింద కేంద్ర ప్రభుత్వం రూ.12,315.5 కోట్లను విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు రూ.3,137.03 కోట్లు, తెలంగాణకు రూ.1,385.25 కోట్లు వచ్చాయి.
- భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన హింస నేపథ్యంలో దాదాపు 550 ఖాతాలను ట్విటర్ తొలగించింది.
- కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) నాయకుడు అభయ్సింగ్ చౌతాలా (57) తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
- రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 17224 మంది చిన్నారుల అదృశ్యం కేసులు నమోదు కాగా 12,807 మందిని రక్షించామని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి వెల్లడించారు.
- తెలంగాణ రాష్ట్రానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.35 లక్షల కోట్లతో రుణ ప్రణాళికను నాబార్డ్ విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రం సేవల రంగంలో దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది. గత అయిదేళ్లలో ఏ రాష్ట్రం సాధించని స్థాయిలో సగటున 10.25% మేర వృద్ధి నమోదుచేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన 2020-21 ఆర్థిక సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2019-20లో స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో సేవల రంగం వాటా 65.19 శాతంగా పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అదనపు సాయం కింద రూ.245.96 కోట్లు విడుదల చేసింది. - తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై 5% ఫిట్మెంట్ (వేతన పెంపుదల) ఇవ్వాలని రాష్ట్ర వేతన సవరణ సంఘం ప్రభుత్వానికి సూచించింది. ఉద్యోగుల పదవీవిరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది.
- AP రాష్ట్ర పశు సంవర్ధక శాఖకు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం లభించింది. 2019-20కి గాను జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్’ అవార్డు దక్కింది.
- ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాల ద్వారా ఏటా సగటున రూ.61,515 ఆదాయం వస్తున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- అక్టోబరు- డిసెంబరు త్రైమాసికానికి ఐసీఐసీఐ బ్యాంక్ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,498.15 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే సమయంలో నమోదైన రూ.4,670.10 కోట్లతో పోలిస్తే లాభం 73 శాతం పెరిగింది.
- 2021-22 ఆర్థిక సంవత్సరంలో వి-షేప్ రికవరీతో 11 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదు చేస్తుందని అంచనావేసింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో ఇండియన్ బ్యాంక్ స్టాండలోన్ పద్ధతిలో రూ.28 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ విలీనం 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నికర లాభం 12 శాతం వృద్ధితో రూ.13,101 కోట్లకు చేరింది. 2019-20 ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.11,640 కోట్లుగా ఉంది.
- జాతీయ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీపీఆర్) డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జి.నరేంద్రకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
- సూర్యాపేట పురపాలికలో ఒప్పంద పారిశుద్ధ్య కార్మికురాలు మెరుగు మారుతమ్మను పారిశుద్ధ్య విభాగంలో ‘కొవిడ్ ఉమెన్ వారియర్స్- ద రియల్ హీరోస్’ అవార్డుకు జాతీయ మహిళా కమిషన్ ఎంపిక చేసింది.
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లిప్సా సయల్ అనే యువతి 14 గంటల్లో 72 కిలోమీటర్లు పరిగెత్తి అరుదైన ఘనత సాధించారు. హరియాణాకు చెందిన సయల్ గతంలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సు నిర్వహించిన 100 కిలోమీటర్ల సైక్లింగ్ పోటీలో పాల్గొంది.
- హైదరాబాద్ రెడ్హిల్స్లోని ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో బోడెంపూడి శ్రీదేవి రాసిన ‘పచ్చని లోగిలి’ పుస్తకాన్ని ఆవిష్కంచారు.
- విశాఖలోని రుషికొండ తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో 30 అడుగుల సముద్ర గర్భం లోతున సహజ శిలాతోరణాన్ని విశాఖకు చెందిన ‘లివ్ఇన్ అడ్వంచర్’ స్కూబా డైవర్ బలరాంనాయుడితో కూడిన నలుగురు సభ్యుల బృందం గుర్తించింది.
- అసోంలోని మరిగోవ్ జిల్లాలో తివా వర్గ ప్రజలు ఏటా నిర్వహించే జోన్బీల్ మేళాలో కరెన్సీ నోటు వినియోగించకుండా వ్యాపార లావాదేవీలు నిర్వహించారు.
- మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి ‘జైలు పర్యాటకం’ ప్రారంభించేందుకు సిద్ధమైంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న పుణేలోని ఎరవాడ జైలులో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ తెలిపారు.
- ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రాన్ని అబూదాబీలో నెలకొల్పారు. దీనికి ‘నూర్ అబూదాబీ’ (వెలుగుల అబూదాబీ) అని నామకరణం చేశారు.
- ప్రముఖ చరిత్రకారుడు, విశ్రాంత అధ్యాపకుడు తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తి (91) హైదరాబాద్లో మరణించారు. సుమారు ఏడు దశాబ్దాలకు పైగా అధ్యాపకుడిగా ఆయన సేవలందించారు.
Join Whatsapp Groups
Exams Trainer Online Exams – https://chat.whatsapp.com/CV1BkyuM4sf2NJvXF8Nm3P
Exams Notes- Edu News https://chat.whatsapp.com/KUGZjaU682B7Np38Cvs3sw
6 Months Current Affairs https://chat.whatsapp.com/EBPqA1In0cbAgbLxyWzQevFree January – 2021 Daily Current Affairs- జనవరి డైలీ కరెంట్ అఫైర్స్ ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోండి ఈ మొబైల్ యాప్ ద్వారా = http://on-app.in/app/oc/58832/sbxxr