02 January 2021 – Daily Current Affairs Bits in Telugu
- దేశీయ అతిపెద్ద స్టీల్ తయారీ కంపెనీ సెయిల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు – సోమ మండల్
- రైల్వే బోర్డు కొత్త చైర్మన్, సీఈఓగా ఎవరు నియమితులయ్యారు – సునీత్ శర్మ
- ఏపీ హైకోర్టు కొత్త సీజేగా ఎవరు నియమితులయ్యారు – జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి
- కేంద్ర జలసంఘం నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు – ఎస్కే హల్దర్
- ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్గా ఎవరు నియమితులయ్యారు – ఆదిత్యనాథ్ దాస్
- ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవోగా ఎవరు నియమితులయ్యారు – లెఫ్టినెంట్ కమాండర్ రవీంద్రనాథ్రెడ్డి
- తెలంగాణ హైకోర్టు సీజేగా నియమితులైన తొలి మహిళా? – జస్టిస్ హిమా కోహ్లి
- ఇటీవల ఆయుష్మాన్ భారత్లో పథకంలో చేరిన దక్షిణాది రాష్ట్రం? – తెలంగాణ
- ఆయుష్మాన్ భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు? – 2018, సెప్టెంబర్ 23న జార్ఖండ్లోని రాంచీలో
- ఆక్స్ఫర్డ్ టీకాకు(కోవిషీల్డ్)ఆమోదం తెలిపిన తొలి దేశం? – బ్రిటన్
- యూకేలో వెలుగులోకి వచ్చిన కొత్త తరహా కోవిడ్ వైరస్ ఏది – వీయూఐ 20212/01’
- ఏ మిస్సైల్ను విదేశాలకు ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయించింది? – ఆకాశ్ మిస్సైల్
- ఇటీవల ఏ దేశం జాతీయ గీతంలో సవరణ చేసింది. – ఆస్ట్రేలియా
- ఆస్ట్రేలియా జాతీయ గీతంఎప్పటినుండి అమల్లోకి వచ్చింది. – 1984 నుండి
- జాతీయ గీతంలో ఏ పదాన్ని చేర్చింది – ‘ఫర్ వుయ్ ఆర్ యంగ్ అండ్ ఫ్రీ’ అనే పంక్తిలో ‘యంగ్’ స్థానంలో ‘వన్’ అనే పదాన్ని చేర్చింది.
- పాక్ జైళ్లలో ఎంతమంది భారత ఖైదీలు ఉన్నారు – 319 మంది (49 మంది సాధారణ పౌరులు, 270 మంది జాలర్లు)
- 2008 లో ఏ రోజున ముంబై ఉగ్రదాడి జరిగింది – 2008 నవంబరు 26న
- ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి ఎవరు ? – లష్కరే తయిబా కమాండర్ జాకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ
- ప్రస్తుతం భారతదేశములో ఎన్ని ఐఐఎం ఉన్నాయి – 20
- ఐఐఎం-సంబల్పూర్ ఏ రాష్ట్రంలో ఉన్నది – ఒడిశా